అమెరికా ఆరోగ్య సిబ్బంది అనుభవాలపై కంటతడిపెట్టిన జో బైడెన్

ట్రంప్పై విజయం సాధించి అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన జో బైడెన్ ఎమోషనల్ అయ్యారు. ఆరోగ్య సిబ్బందితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా విధుల్లో ఉన్న ఆ దేశ ఆరోగ్య సిబ్బంది తమ క్షేత్ర స్థాయి అనుభవాలను కాబోయే అధ్యక్షుడికి తెలియజేశారు. ఈ సందర్భంగా జో బైడెన్ కంటతడిపెట్టారు.
మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్ అనే నర్స్.. మరణానికి చేరువలో ఉన్న కొవిడ్-19 బాధితులతో తన అనుభవాలను వివరించారు. కొవిడ్ బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం పరితపించే వారని, వారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చానని మేరీ చెప్పారు. అది విన్న బైడెన్ ఒకింత భావోద్వాగానికి గురై కన్నీరు కార్చారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో.. పలువురు నర్సులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బైడెన్కు వివరించారు. PPE కిట్ల కొరత వేధిస్తోందన్నారు. రక్షణ కోసం తాము ప్లాస్టిక్ సంచులను వాడుతున్నామని కొందరు బైడెన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్- 95 మాస్కులను మళ్లీ మళ్లీ వాడటంతో అవి లూజ్గా మారి కింద పడిపోయిన సందర్బాలూ ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి అనుభవాలు విన్న బైడెన్ కన్నీరు ఆపుకోలేకపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com