పాకిస్తానీలు ఇండియాకు అతిపెద్ద సంపద.. కాంగ్రెస్ నేత కాంట్రవర్సీ

కాంగ్రెస్ (Congress) సీనియర్ నేతలు తమ కామెంట్లతో ఏదో వివాదంలో ఉంటూనే ఉంటారు. వివాదాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ మరోసారి కాంట్రవర్సీ రేపారు. దీనిపై ఇపుడు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరి 11 ఆదివారం నాడు పాకిస్థాన్లోని లోహోర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. పాక్ను ప్రశంసలతో ముంచెత్తారు. పాకిస్తానీలు భారత్కు అతి పెద్ద సంపద అని అన్నారు. కరాచీలో దౌత్యవేత్తగా పనిచేసిన కాలంలో తనను, తన భార్యను ఇక్కడి వారు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని చెప్పారు.
''మీరు(పాకిస్తానీలు) ఒక విషయం గుర్తుంచుకోండి. భారత్లో మోడీకి ఎప్పుడూ మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. దీనిని బట్టి మూడింట రెండు వంతుల మంది భారతీయులు మీవైపే ఉన్నారు'' అని అయ్యర్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్తో చర్చలు జరిపేందుకు నిరాకరిస్తూ ప్రధాని మోదీ 'అతిపెద్ద తప్పు' చేశారని అన్నారు. ''మీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసే ధైర్యం మాకుంది. కానీ, కూర్చుని చర్చింకునే ధైర్యం మాత్రం లేదు'' అని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com