Mexico Road Accident: లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు

పండగ పూట విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోయారు. తూర్పు మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో బస్సు ఘోర ప్రమాదానికి గురై కనీసం 10 మంది మరణించగా, 32 మంది గాయపడ్డారని అధికారులు గురువారం ధృవీకరించారు.
జోంటెకోమాట్లాన్ పట్టణంలో క్రిస్మస్ పండుగ రోజున ఈ ప్రమాదం జరిగిందని, బస్సు మెక్సికో నగరం నుండి చికోంటెపెక్ గ్రామానికి ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. జోంటెకోమాట్లాన్ మేయర్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మరణించిన వారిలో తొమ్మిది మంది పెద్దలు మరియు ఒక పిల్లవాడు ఉన్నారు.
మున్సిపల్ అధికారులు గాయపడిన 32 మంది ప్రయాణికుల జాబితాను, వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వివరాలను కూడా విడుదల చేశారు.
మెక్సికోలో ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. అతివేగం, పేలవమైన రోడ్డు పరిస్థితులు, యాంత్రిక వైఫల్యం కారణంగా ఈ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. గత నెల నవంబర్ చివరలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్లో జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం 10 మంది మరణించారు, 20 మంది గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

