Pak Army Chief-US President :అమెరికా అధ్యక్షుడితో పాక్ ఆర్మీ చీఫ్ లంచ్

X
By - Manikanta |18 Jun 2025 5:00 PM IST
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో అమెరికాలో పర్యటిస్తున్నారు. అసిమ్ మునీర్ రెచ్చగొట్టడంతోనే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల తర్వాత అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం మధ్యాహ్నం 1 ఒంటి గంటకు వాషింగ్టన్లోని వైట్హౌస్లో అసిమ్ మునీర్తో ట్రంప్ సమావేశం అయ్యారు. ఇద్దరు కలిసి భోజనం చేసిన అనంతరం ఇద్దరి మధ్య సమావేశం జరగనుంది. ఇక అమెరికా పర్యటనలో భాగంగా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్లను కూడా అసిమ్ మునీర్ కలవనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com