Turkey President : పాక్ ప్రధాని నా విలువైన మిత్రుడు :టర్కీ అధ్యక్షుడు

Turkey President : పాక్ ప్రధాని నా విలువైన మిత్రుడు :టర్కీ అధ్యక్షుడు
X

భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వేళ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగా న్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో తమ స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు విలువైన మిత్రుడని వ్యాఖ్యానించారు. భారత్ -పాకి స్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దాయాది దేశం మన భూభాగంపైకి ప్రయోగిం చిన డ్రోన్లు టర్కీ దేశానికి చెందినవిగా తేలిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఆ దేశంలో భూకంపం వచ్చినప్పుడు మొదటగా స్పందించి సాయం చేసింది మన దేశమే. అలాంటి మానవతా సాయాన్ని మరిచి టర్కీ ఇటీవల పాకిస్తాన్ఆ యుధాలతో పాటు కొంతమందినిపుణులైన సైనికులను పంపించింది. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ దేశానికి టూర్లను బహిష్కరించారు. ఆ దేశానికి చెందిన యాపిల్స్ తో పాటు ఇతర వస్తువులను కూడా బహిష్కరించడం మొదలు పెట్టారు. ఈ తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు తాజాగా పాక్తో భవిష్యత్తులోనూ తమ మైత్రీ కొనసాగుతుందంటూ సెలవిచ్చారు.

Tags

Next Story