Russia Revenge : రష్యా ప్రతీకారం.. ఉక్రెయిన్ పై భీకర దాడులు

తమ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ప్రతీకారంగా రష్యా భీకర దాడులు జరుపుతోంది. మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో కీవ్ లోని లక్ష్యాలపై విరుచుకుపడుతోంది. మొన్నటికి మొన్న 479 డ్రోన్లతో నిప్పులు కురిపించిన మాస్కో బలగాలు, సోమవారం అర్ధరాత్రి వేళఏకంగా 315 షాహెద్ డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో 15 మంది మరణించారని, 35 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ వాయు సేనను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. డ్రోన్లతోపాటు ఉత్తర కొరియాకు చెందిన కేఎన్-23 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు ఇస్కాండర్-కె క్రూయిజ్ మిస్సయిళ్లను రష్యా బలగాలు ప్రయోగిం చాయి. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ ను ప్రధానంగా టార్గెట్ చేశాయి. రష్యా దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టామని ఉక్రెయిన్ బలగాలు పేర్కొంటున్నాయి.
213 డ్రోన్లు, ఏడు మిస్సయిళ్లను నేలకూల్చినట్లు వెల్లడించాయి. రాడార్స్ నుంచి 64 డ్రోన్లు అదృశ్య మైనట్లు కీవ్ మీడియా పేర్కొంది. రష్యా దాడుల కారణంగా దక్షిణ నగరంలోని ఓ ప్రసూతి ఆస్పత్రి, వైద్య పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తు న్నాయి. అటాక్ తర్వాత అనేక జి ల్లాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వ హిస్తున్నామని కీవ్ మేయర్ విటా లీ క్లిచ్కో తెలిపా రు. మంగళవారం ఉదయం కీవ్ అధికారులు స్థానిక ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఒడిసా పట్టణంపై కూడా భీకర దాడులు జరిగాయి. రష్యాకు చెందిన వైమానిక టార్గెట్లను నిర్వీర్యం చేశామని, 322 టార్గెట్లలో 284 కూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది. కీవ్, ఒడిసా, డిప్రో, చెర్నిహైవ్ ప్రాంతాలపై అతిపెద్ద దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com