Mexico : మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి

మెక్సికోలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొన్న పౌరులపై దుండుగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనను మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ ఖండించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, గువానాజు వాటో రాష్ట్రంలోని ఇరాపువాటోలో బుధవారం రాత్రి ఓ స్ట్రీట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు. వేడుకల్లో పాల్గొన్నవారంతా డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ జోరుగాహుషారుగా ఉన్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగుడు వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో వారంతా భయంతో కేకలువేస్తూ పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, గత నెలలోనూ గ్వానాజువాటోలోని శాన్ బార్టోలో డీ బెర్రియోస్లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ దుండగులు ఇలాగే కాల్పులు జరిపారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com