Austrian School : ఆస్ట్రియా స్కూల్లో విద్యార్థి కాల్పులు.. 10 మంది తోటి విద్యార్థులు మృతి

ఆస్ట్రియా గ్రాజ్సిటీలోని ఓ స్కూల్లో కాల్పుల ఘటన చోటుచేసు కున్నది. ఆ కాల్పుల్లో 10 మంది మరణించారు. కాల్పుల్లో అనేక మంది గాయపడ్డా రు. స్కూల్లోని విద్యార్థే కాల్పులు జరిపినట్లు తెలిసింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అతడి నివారించడా నికి ప్రయత్నించిన మహిళా ఉపాధ్యాయురాలిపై పలురౌండ్లు కాల్పులు జరపడం తో ఆమె తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. కాల్పుల ఘటన తర్వాత హంతకుడు తనను తాను కాల్చుకుని మరణించాడు. అతడి మృతదేహం పాఠశాలలోని బాత్రూమ్లో దొరికింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు. 20215 జూన్ 20లో గ్రాజ్ లో జరిగిన కాల్పుల ఘటనకు పదేళ్లు పూర్తవుతున్న క్రమంలో వార్షికోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన కలకలం రేపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com