US : ఇరాన్ పై దాడి కోసం యూఎస్ మన గగనతలాన్ని వాడలే

ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసినప్పుడు అమెరికా భారత గగనత లాన్ని వినియోగించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ ఎయిర్ స్పేస్ ను యూఎస్ వినియోగించినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్ 'మిడ్నైట్ హ్యామర్' పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల కోసం వినియోగించిన యూఎస్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. సంబంధిత పోస్టులన్నీ నకిలీవిగా పీఐబీ ఫ్యాక్ట్చిక్ తేల్చింది. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాలు పయనించిన మార్గాలను ఆ దేశ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డేనియల్ కెయిన్ మీడియా సమావేశంలో వివరించారని తెలిపింది. ఈ మేరకు సంబంధిత వీడియో లింక్ ను పోస్ట్ చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com