UK Riots : యూకేలో అల్లర్లు.. కేంద్రం అలర్ట్!

X
By - Manikanta |7 Aug 2024 3:00 PM IST
బ్రిటన్ వలస వ్యతిరేక గ్రూపులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. బ్రిటన్ లోని పలు నగరాలు, పట్టణాలలో వీరి నిరసనలు హింసాత్మకంగా మారాయి. అవి క్రమేణా దేశమంతా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది.
లండన్ లోని భారత రాయబార కార్యాలయం అడ్వయిజరీని జారీ చేసింది. "ఇటీవలి అల్లర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. భారత రాయబార కార్యాలయం పరిస్థితిని గమనిస్తోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీల సూచనల్ని పాటించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాలి" అని సదరు అడ్వయిజరీ నోట్ లో హైకమిషన్ సూచించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com