AP Woman : కువైట్ లో నన్ను కాపాడండి.. లోకేశ్ కు కాకినాడ మహిళ విన్నపం

కువైట్లో పని చేస్తున్న కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రాధేయపడింది. తనను కాపాడి అక్కడి నుంచి సొంతూరుకు రప్పించాలని కోరింది. కువైట్లో అక్కడి వారు పెడుతున్న చిత్ర హింసల నుంచి రక్షించాలనికోరింది. తిండి పెట్టకుండా చంపేస్తున్నారంటూ దీనంగా ప్రభుత్వాన్ని వేడుకొంది. గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారి భర్త మృతితో పిల్లలు, కుటుంబాన్ని పోషించేందుకు పిల్లలను తన తల్లికి అప్పగించి కువైట్ వెళ్లింది. అక్కడికి వెళ్లిన ఆమె చిత్రహింసలకు గురవుతున్నట్టు వీడియో ద్వారా బాధలు చెప్పుకుంది. గల్ఫ్ కంట్రీస్ లో బాధలు పడుతున్న వారిని ఇటీవల క్షేమంగా స్వరాష్ట్రానికి చేరుస్తున్నారు మంత్రి లోకేశ్. దీనిపై ఆయన కార్యాలయం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com