రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలు

X
By - TV5 Telugu |2 July 2019 6:32 AM IST
ఏపీలో టీడీపీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలో తమ కార్యకర్తలకు రక్షణ లేదని నిన్న డీజీపీ గౌతం సవాంగ్ కు తెలుగుదేశం సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. చిలకలూరిపేట టీడీపీ నేత బుచ్చిబాబు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న మహిళలను దుర్భాషలాడారు. బెదిరించారు. వైసీపీ నేతల దాడి గురించి తెలుసుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుచ్చిబాబు ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com