పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు వేసి అపహాస్యం చేశారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
By - TV5 Telugu |28 Jan 2020 3:57 PM GMT
పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేసి అపహస్యం చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్. హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ సర్కారుకు చెంపపెట్టు అన్నారు. చివరికి చెత్త కుండీలకు, శ్మశానాలకు సైతం వైసీపీ రంగులు వేశారన్నారు. ఇందుకోసం 1300 కోట్లు ఖర్చు చేశారని, ఇప్పుడు ఆ రంగులు తీసువేయడానికి మరో 1300 కోట్ల ఖర్చు చేయాలన్నారు. మొత్తం 2600 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సీఎం జగన్ తన సొంత డబ్బుతోనే ఆ రంగులు తీసువేయాలని డిమాండ్ చేశారు రాజేంద్రప్రసాద్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com