విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు: టీడీపీ నేత పట్టాభి
By - TV5 Telugu |25 Feb 2020 10:06 PM GMT
వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలను తుంగలో తొక్కిందన్నారు టీడీపీ సీనియర్ నేత పట్టాభి. ప్రతి విద్యార్ధి చదువు కోసం లక్షా 50 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పన్నారు. ప్రకటన కోసం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వివిధ పథకాల కింద విద్యార్ధులకు 37 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాలన్నారు. కానీ కేవలం 12, 400 కోట్సలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 25 వేల కోట్లు కోతపెట్టి సీఎం జగన్ విద్యార్ధులను మోసం చేశారని, పథకాలన్ని రద్దు చేసి విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com