నవరత్నాలను చాక్లెట్లతో పోల్చిన కన్నా లక్ష్మీ నారాయణ
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో.. అధికార పార్టీ వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దీనిపై కేంద్రం, CEC జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో బీజేపీ కార్యాలయాన్ని కన్నా ప్రారంభించారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి ఏపీలో లేదన్న ఆయన.. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
జగన్ ప్రభుత్వం అమలు చేస్తామన్న నవరత్నాలను చాక్లెట్లతో పోల్చారు కన్నా లక్ష్మీనారాయణ. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేశారని.. ఆర్టీసీ ఛార్జీలు భారంగా మారిపోయాయని, లిక్కర్ రేట్లు ఎగబాకాయని గుర్తు చేశారు. సామాన్యులపై అసాధారణ భారాలు మోపుతున్నారని కన్నా విమర్శించారు. దేవాదాయ భూములనూ లాక్కుంటున్నారని ఆరోపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com