ఏపీలో మరో 35 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో 35 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా ప్రభావం తగ్గటం లేదు. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా 35 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 757లు చేరుకుందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. అయితే.. ఇప్పటివరకు 96 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. 20 మంది కరోనాతో మృతి చెందారు. ఇంకా 639 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా కర్నూల్ లో 10, గుంటూరులో 9 నమోదవ్వగా.. కడపలో 6, పశ్చిమ గోదావరిలో 4 కేసులు బయటపడ్డాయి. అటు.. కృష్ణ, అనంతపురంలో 3 కేసుల చొప్పున నమోదయ్యాయి.

కాగా.. ఇంతవరకు శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Tags

Read MoreRead Less
Next Story