నిరాహారదీక్ష చేపట్టిన నిమ్మకాయల చినరాజప్ప

నిరాహారదీక్ష చేపట్టిన నిమ్మకాయల చినరాజప్ప

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. దీంతో ప్రతీ పేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసంలో నిరాహారదీక్ష చేస్తున్నారు.

తక్షణమే అన్న క్యాంటీన్లనుతెరవాలని.. దీంతో ఈ కష్ట సమయంలో చాలా మేలు చేస్తుందని అన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, పండ్ల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని.. సెరి కల్చర్, ఆక్వా కల్చర్, పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలని చినరాజప్ప డిమాండ్ చేస్తూ.. దీక్ష చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story