మహారాష్ట్రలో మరో 394 కొత్త కేసులు.. 18 మరణాలు

మహారాష్ట్రలో మరో 394 కొత్త కేసులు.. 18 మరణాలు

మహారాష్ట్రలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దేశంలో అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 394 కరోనా కేసులు నమోదయ్యాయన.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,817కి చేరింది. గత 24 గంటల్లో 18 మంది మరణించారని.. దీంతో మొత్తం మరణాల సంఖ్య 301కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 800 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అయ్యారు. కరోనా ప్రభావం విస్తృతంగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇదో సవాల్ గా మారింది. దేశంలో అతి పెద్ద రెడ్ జోన్ గా మహారాష్ట్ర మారింది.

Tags

Read MoreRead Less
Next Story