ఏపీలో మరో 67 కేసులు.. కర్నూలులోనే ఎక్కువగా..

ఏపీలో మరో 67 కేసులు.. కర్నూలులోనే ఎక్కువగా..

ఏపీలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. గడిచైనా 24 గంటల్లో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరింది. ఇప్పటివరకూ 524 మంది కోలుకోగా.. 33 మంది మరణించారు. ఇక 1093 మంది చికిత్స పొందుతున్నారు.

తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలులో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. తరువాత గుంటూరులో 19 కేసులు, కృష్ణాలో 12 కేసులు నమోదయ్యాయి. విశాఖలో 6, కడపలో 4, చిత్తరులో ఒక కేసు నమోదైంది.

may4

Tags

Read MoreRead Less
Next Story