ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 38 కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదనట్టు.. ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 వేల 18కి చేరింది. 7 వేల 409 శాంపిల్స్ పరీక్షించగా... 38 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 2 వేల 18 కేసుల్లో... 998 మంది డిశ్చార్జ్ కాగా... 45 మంది చనిపోయారు. ప్రస్తుతం 975 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో తొమ్మిదేసి కేసులు నమోదవగా... అనంతపురం 8, గుంటూరు 5, కృష్ణా-విశాఖలో చెరో మూడు, నెల్లూరు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. తూర్పుగోదావరి, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన 9 కేసుల్లో... 8 కేసులకు తమిళనాడు కోయంబేడు మార్కెట్ లింక్లున్నట్టు గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే... అత్యధికంగా కర్నూలు జిల్లాలో 575 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 387, కృష్ణా - 342, చిత్తూరు- 121, అనంతపురం -114, నెల్లూరు -102, కడప-97, పశ్చిమగోదావరి - 68, విశాఖ -66, ప్రకాశం-63 తూర్పుగోదావరి జిల్లా 46, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com