కరోనా నుంచి కోలుకుంటున్న వారి రేటు క్రమంగా పెరుగుతుంది: కేంద్ర మంత్రి

కరోనా నుంచి కోలుకుంటున్న వారి రేటు క్రమంగా పెరుగుతుంది: కేంద్ర మంత్రి

భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటోన్న వారి శాతం క్రమంగా పెరగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. రికవరీ రేటు 31.7 శాతంగా ఉందరి ఆయన తెలిపారు. అయితే, కరోనా మృతుల సంఖ్య మాత్రం ఇతర దేశాల వారితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందని అన్నారు. ప్రపంచ దేశాల్లో మృతుల శాతం 7.2 నుంచి 7.5 ఉందని ఆయన తెలిపారు. కానీ, భారత్ లో మాత్రం 3.2 మాత్రమే ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకూ 70, 756 కేసులు నమోదవ్వగా.. 22, 455 మంది రికవర్ అయ్యారు. 2,293 మంది చనిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story