విశాఖ వెళ్తా.. అనుమతి ఇవ్వండి.. తెలుగు రాష్ట్రాల డీజీపీలకు చంద్రబాబు లేఖ

విశాఖ వెళ్తా.. అనుమతి ఇవ్వండి.. తెలుగు రాష్ట్రాల డీజీపీలకు చంద్రబాబు లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించేందుకు సోమవారం విశాఖలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం రెండు రాష్ట్రాల డీజీపీలకు లేఖలు రాశారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి అమరావతి రావడానికి లేదంటే విమానంలో నేరుగా విశాఖ వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అమరావతి రావడానికి అనుమతి కోరుతూ రెండు రాష్ట్రాల డీజీపీలకు చంద్రబాబు లేఖలు రాశారు. తెలంగాణ డీజీపీ నుంచి వెంటనే అనుమతి వచ్చినప్పటికీ.. ఏపీ డీజీపీ దీనిపై ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన జరిగినప్పుడే విశాఖ వెళ్లాలని చంద్రబాబు భావించారు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా వీలుకాక హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఏపీ డీజీపీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story