రాజ్యాంగ అతిక్రమణలతో ఏడాది పాలన సాగింది: లోకేష్

రాజ్యాంగ అతిక్రమణలతో ఏడాది పాలన సాగింది: లోకేష్

జగన్ ఏడాది పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో విమర్శల వర్షం కురిపించారు. 65 సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలతో ఏడాది పాలన సాగిందన్నారు. ఇక, ప్రజల విషయానికి వస్తే.. ఏడాది కాలంలో ఎంతోమంది కార్మికులు, రాజధాని రైతులు, అన్నదాతల ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. జగన్ పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగా పడ్డారని ట్వీట్ చేశారు లోకేష్.

Tags

Read MoreRead Less
Next Story