ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,81,817కి చేరింది. అటు ఆరోజు కరోనా వల్ల 87 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కరోనా మరణాలతో ఏపీలో మరణాల సంఖ్య 2,562కి చేరింది. అటు, గడిచిన 24 గంటల్లో 10,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల కరోనా రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. ఇప్పటివరకూ 1,91,117 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా.. ఇంకా 88,138 చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story