AP : మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి
By - Vijayanand |19 April 2023 10:00 AM GMT
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో యథేచ్చగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు లేకున్నా తవ్వకాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. షాద్ పాలెంలో టిప్పర్ల సాయంతో భారీగా మట్టిని తరలిస్తున్నారు. మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే ఈ తతంగం అంతా నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రి అనుచరులే మట్టి మాఫియాను నడిపిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని.. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com