ఏపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 10,601 కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 10,601 కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులు అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులు అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులు అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,601 కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 5,17,094కు చేరింది. అటు, ఈ రోజే కరోనా కాటుకి 73 మంది మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 4,560కు చేరింది. అయితే, మొత్తం కరోనా కేసుల్లో ఇప్పటివరకూ 4,15,765 మంది కోలుకోగా.. ఇంకా, 96,769 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, ఏపీలో ఇటీవల కరోనా రికవరీ గణనీయంగా నమోదవుతుంది. ఇప్పటివరకూ ఏపీలో 42,37,070 కరోనా పరీక్షలు జరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story