PAWAN: నా గెలుపు చరిత్రలో నిలవాలి

PAWAN: నా గెలుపు చరిత్రలో నిలవాలి
పార్టీ శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ దిశా నిర్దేశం... వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచన

పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తనకు లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేందుకు కృషి చేస్తామని కూటమిలోని పార్టీలు ప్రకటించడం..హర్షణీయమన్నారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. పిఠాపురంలో NDA కూటమి కార్యకర్తలతో సమావేశమైన పవన్ .. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. తెలుగుదేశం నేత వర్మ త్యాగం గొప్పదన్న పవన్ ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు చాలా సమర్థవంతమైన నాయకుడని పవన్ కొనియాడారు. తాను రాష్ట్ర ప్రజల కోసం తగ్గానని తెలిపారు. చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడని... అందరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పవన్‌ వెల్లడించారు.


"చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తెలుగు తమ్ముళ్ల బాధ నన్ను కదిలించింది. టీడీపీ ఎంతో సమర్థవంతమైన పార్టీ. స్ట్రక్చర్‌ కలిగిన పార్టీని నడపడం అంత సులువు కాదు. జనసేన దగ్గర స్ట్రక్చర్‌ లేదు కానీ బలం ఉంది. ఆ బలం స్ట్రక్చర్‌ కలిసి ముందుకు వెళితేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలం. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. నా కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేసి నా గెలుపునకు సహకరిస్తాననడం శుభ పరిణామం. చంద్రబాబు చెప్పారు నేను చేస్తా.. అని ఒకే మాట చెప్పారు. ఒంటరిగా పోరాడి గెలిచే దమ్మున్న నాయుడు వర్మ. కానీ, రాష్ట్రం బాగుపడాలని మంచి ఉద్దేశంతో ఆయన సీటు త్యాగం చేయడం శుభ పరిణామం. తెదేపా, భాజపా హక్కులకు, రాజకీయ మనుగడకు ఇబ్బంది లేకుండా పనిచేస్తాం. జనసేన, తెదేపా నాయకుల మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలి. పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి. ఆ బాధ్యత వర్మకు అప్పగిస్తున్నా’’ అని పవన్‌ అన్నారు.

మరోవైపు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగాకర్నూలు, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. ముందుగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రాంతాన్ని జగన్‌ ఐదేళ్లుగా దగా చేశారని.. మండిపడ్డారు. సీమలో వెనకబడిన వర్గాలను నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరు సిద్ధం సభలో జిల్లాకు చెందిన తమ అభ్యర్థులందరూ పేదవాళ్లంటూ జగన్‌ చెప్పిన మాటలకు.. చంద్రబాబు కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ పాలనలో30ఏళ్లు వెనక్కెళ్లిన ఏపీని..పునర్నిర్మించేందుకే బీజేపీతో జతకట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమిలో ఉన్నామైనార్టీల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు. సామాజిక న్యాయానికి బ్రాండ్‌ అంబాసిడర్‌.తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు..తమ అభ్యర్థుల్లో బీసీలకు పెద్దపీట వేశామన్నారు. సీమలో ఏకపక్షంగా తన సామాజికవర్గానికే సీట్లిచ్చిన జగన్‌..సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story