Nellore: సోమిరెడ్డి నిరవధిక నిరాహార దీక్ష భగ్నం

Nellore: సోమిరెడ్డి నిరవధిక నిరాహార దీక్ష భగ్నం
దీక్ష శిబిరానికి వందమంది హిజ్రాలు.. వైసీపీ పనేనంటున్న టీడీపీ నేతలు

జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోమిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆపై వాహానాల్లో ఆయనను ఇంటికి తరలించారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి సుమారు 200 మంది హిజ్రాలు, వైసీపీ గూండాలను అక్రమార్కులు పంపారు. క్వారీలో ఉన్న భారీ యంత్రాలు, వాహానాలను బయటకి పంపేయత్నం చేశారు. అయితే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు జరిగి.. ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను బయటకి పంపారు. వైసీపీ గూండాలకు పోలీసులు సపోర్డు చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష వద్దకు హిజ్రాలు పెద్ద ఎత్తున చేరుకోవడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి క్వార్ట్జ్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తుండడాన్ని అడ్డుకునేందుకు చంద్రమోహన్‌రెడ్డి మూడు రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.


దీనిని అడ్డుకునేందుకు నిన్న సాయంత్రం రెండు బస్సుల్లో దాదాపు వందమంది హిజ్రాలు క్వారీ వద్దకు చేరుకున్నారు. అయితే, వారి పాచిక పాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. వైసీపీ నేతలే వారిని బస్సుల్లో తీసుకొచ్చి వదిలిపెట్టారని, అక్కడ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీక్ష శిబిరం వద్ద దాదాపు 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండడంతో చేసేదేమీ లేక తిట్టుకుంటూ హిజ్రాలు వెనుదిరిగారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చిన హిజ్రాలు క్వారీ మొత్తం తిరిగారు. వారిని అడ్డుకున్న టీడీపీ నేతలు ఇక్కడకు ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టారు. క్వారీకి దిష్టి తీసుకేందుకు వచ్చామని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. క్వారీకి దిష్టి ఏంటని ప్రశ్నిస్తే మాత్రం వారి నుంచి సమాధానం రాలేదు.

అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతలు వారిని అక్కడకు రప్పించి గలాటా సృష్టించేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే క్వారీలో సిద్ధంగా ఉన్న 12 లారీల తెల్లరాయిని అక్కడి నుంచి దాటించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఆ తర్వాత కొంతసేపటికి సోమిరెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు. కాగా, ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో చంద్రమోహన్‌రెడ్డి సత్యాగ్రహ దీక్షనను పోలీసులు భగ్నం చేశారు. సోమిరెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇంటివద్ద వదిలిపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story