ఇసుకను దోచుకోవడానికి వైసీపీ వ్యూహ రచన చేసింది: బోండా ఉమా
ఇసుక కార్పోరేషన్ ఏర్పాటు నిర్ణయంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. సహజ సిద్ధమైన ఇసుకను దోచుకోవడానికి వైసీపీ వ్యూహ రచన చేసిందని టీడీపీ సీనియర్నేత బోండా ఉమా ఆరోపించారు. ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించే అవకాశం ఉన్నా... మాఫియా నుంచి వచ్చే డబ్బు కోసం ఏపీఎండీసీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు కొట్టేయడానికి వైసీపీ నేతలు ప్రణాళిక రచించారని ధ్వజమెత్తారు.
జగన్ సర్కారు ఆమోదించిన నూతన పాలసీతో ట్రక్కు ఇసుక 50 వేల రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే భవన నిర్మాణ రంగం కుదేలైందని చెప్పారు. భవిష్యత్లో మరింత నష్టం వాటిల్లనుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికే వలస పోతున్నారని బోండా ఉమా ఆవేదన వ్యక్తంచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com