Botsa Satyanarayana : ఏపీ రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స
Botsa Satyanarayana : ఏపీ రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. CRDA చట్టం ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు తీర్పుఇచ్చినా.. మంత్రి మాత్రం తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని మరోసారి తేల్చిచెప్పారు. ఒకటికి పదిసార్లు చెపుతున్నాం.. మూడు రాజధానుల నిర్మాణం మా పార్టీ విధానం అని స్పష్టం చేశారు. ఇందుకోసం రానున్న అసెంబ్లీలో బిల్లుపెట్టే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. శివరామకృష్ణ కమిషన్ అభిప్రాయం కూడా ఇదే అన్నారు. టీడీపీ స్వార్ధం కోసమే పోలవరాన్ని, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టినట్లు బొత్స ఆరోపించారు. జిల్లాల పునర్విభజనపై వచ్చే వినతులను కమిటీ పరిశీలిస్తుందని... వచ్చే ఉగాదికి కొత్తజిల్లాల నుంచి పాలన ప్రారంభం కానున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com