Chandrababu : ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
By - TV5 Digital Team |24 Dec 2021 8:54 AM GMT
Chandrababu : కుప్పం ఐటీడీపీ కార్యకర్త మురళిపై జరిగిన దాడి ఘటనపై ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.
Chandrababu Naidu : కుప్పం ఐటీడీపీ కార్యకర్త మురళిపై జరిగిన దాడి ఘటనపై ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ గూండాలు మురళీపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ సానుభూతిపరులపై పదేపదే హింసాత్మక దాడులు జరుగుతున్నా.... ఇప్పటివరకు పోలీసులు దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మురళీపై దాడి చేశారని... ఆయన కుడి కన్ను దగ్గర గాయమైందన్నారు. రెస్కో ఛైర్పర్సన్ ఇంటికీ తీసుకెళ్లి.. ఆయన్ను తీవ్రంగా హింసించారని లేఖలో తెలిపారు. భవిష్యత్లో మురళిపై ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి... బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com