ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా

ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా
ఏపీలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 7,228 మందికి కరోనా సొకినట్టు ఏపీ ఆరోగ్యశాఖ తెలిపింది.

ఏపీలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 7,228 మందికి కరోనా సొకినట్టు ఏపీ ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,46,530కు చేరింది. అయితే, మొత్తం కేసుల్లో 5,70,667 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా, 70,357 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఒక్కరోజే 45 కరోనా మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ 5,506 మంది ఈ మహమ్మారికి బలైపోయారు. కాగా.. ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణీనీయంగా పెరుగుతున్నాయి. దీంతో రికవరీ రేటు కాస్తా ఉపసమనం కలిగిస్తుంది

Tags

Read MoreRead Less
Next Story