ఏపీలో కరోనా ఎలా ఉంది.. 24 గంటల్లో నమోదైన కేసులు..
corona update in ap: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 94,595 పరీక్షలు నిర్వహించగా, 3,175 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,02,923 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కోవిడ్ మరణాలు ఇప్పటి వరకు 12,844. ఒక్క రోజు వ్యవధిలో 3,692 మంది బాధితులు కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 18,54,754కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టెస్టులు నిర్వహించింది 2,23,63,078 అని ఆరోగ్య శాఖ తెలిపింది. చిత్తూరులో అత్యధికంగా ఏడుగురు కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com