SHARMILA: వివేకాను హత్య చేయించిన అవినాష్‌ను ఓడించండి

SHARMILA: వివేకాను హత్య చేయించిన అవినాష్‌ను ఓడించండి
హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న జగన్‌... జగన్‌ ఓ కుంభకర్ణుడు

ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌ని ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పునరుద్ఘాటించారు. కుంభకర్ణుడు ఆరునెలలపాటు నిద్రపోతే జగన్ నాలుగున్నరేళ్లు నిద్రపోయారని ధ్వజమెత్తారు. వివేకాని హత్య చేయించిన అవినాష్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని కడపవాసులను షర్మిల విజ్ఞప్తి చేశారు. న్యాయ బస్సుయాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల మూడోరోజు వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీకే దిన్నె, పెండ్లిమర్రి, వీఎన్ పల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు మండలాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. వివేకా కుమార్తె సునీత ఆమె వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని.. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని షర్మిల విమర్శించారు. అవినాష్ రెడ్డిని సీబీఐ.... నిందితుడిగా చెబుతున్నా అధికార అహకారంతో శిక్ష పడకుండా జగన్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలు చేస్తున్న ఇలాంటి నాయకులకు వైకాపా మళ్లీ టికెట్ ఎలా ఇస్తుందని షర్మిల నిలదీశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై షర్మిలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ బిడ్డను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ విరుచుకుపడ్డారు. నోరు ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కడప ఎంపీగా షర్మిలను గెలిపించుకునేందుకు వివేకా కుమార్తె సునీత పలువురి మద్దతు కూడగడుతున్నారు. కుటుంబానికి చెందిన శివప్రకాశ్‌రెడ్డిని వెంటపెట్టుకుని వేంపల్లెలో వైకాపా నాయకుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరారు. ఇటీవల తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, వైకాపా జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతోపాటు షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story