సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసిపి ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి : చంద్రబాబు

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసిపి ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి : చంద్రబాబు
ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయం అని అన్నారు చంద్రబాబు.

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరగడంపై చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నమే అజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. SECపై దాడి, న్యాయవ్యవస్థపై దాడి, న్యాయమూర్తులపై దుర్భాషలు, ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులు, కోర్టు తీర్పులను అమలు చేయకపోవడం, మండలి రద్దుకు బిల్లు, నిజాయితీగా పనిచేసే అధికారులకు వేధింపులు, ఈసీని కులం పేరుతో దూషించడం, జీవో 2430 ద్వారా మీడియాపై ఆంక్షలు విధించడం.. ఇలా ఏ వ్యవస్థను సజావుగా పని చేయనీయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలు, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియా అనే 4 మూల స్థంభాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఏదేమైనా ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షికంగా ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీని కోరారు చంద్రబాబు.

వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీఇన్నీ కావన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సజావుగా పని చేయనీయకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయం అని అన్నారు చంద్రబాబు.

ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయం అని అన్నారు చంద్రబాబు. పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసిపి ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలన్నారు. గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్‌ఈసీని కోరుతున్నామన్నారు చంద్రబాబు.



Tags

Read MoreRead Less
Next Story