దమ్ముంటే వైసీపీ నేతలు వాటిని బయటపెట్టాలని దివ్యవాణి సవాల్
అధికార పార్టీ నేతలు అమరావతిలో దొంగల్లా తిరుగుతున్నారని టీడీపీ నాయకురాలు దివ్యవాణి ఘాటుగా వ్యాఖ్యానించారు. తుళ్లూరులో ఆమె రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలను ఎదుర్కోలేక ప్రభుత్వం పోలీసులతో రాక్షసంగా దాడులు చేయించిందని ఆమె మండిపడ్డారు. పరదాలు కట్టుకుని అసెంబ్లీకి వెళ్లాల్సిన దుస్థితి వైసీపీ నేతలు తెచ్చుకున్నారని ఆమె అన్నారు. సబ్బంహరి 4 అడుగులు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఆయన ఇంటి ప్రహారీ కూలగొట్టారు... మరి రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ప్రభుత్వాన్ని ఏం చేయాలని అని దివ్యవాణి నిలదీశారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత వైజాగ్లో 72 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించారని, దమ్ముంటే వైసీపీ నేతలు వాటిని బయటపెట్టాలని ఆమె సవాల్ విసిరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com