Aha : ఆహాను షేక్ చేస్తున్న .. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్

Aha : ఆహాను షేక్ చేస్తున్న .. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్

రీసెంట్ గా విడుదలైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్.. ఓటీటీలో మోత మోగుతోంది. సుహాస్ హీరోగా, శివాని నగరం హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని దీనికి దర్శకత్వం వహించాడు. ఫిదా ఫేమ్‌ శరణ్యా ప్రదీప్‌ మరో కీలక పాత్ర పోషించింది. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు . విలేజ్ ఎమోషనల్ డ్రామాలో సాగిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్చి 1 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాగా.. తొలి ఐదు రోజుల్లోనే 10 కోట్ల నిమిషాల మార్క్ అందుకుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ వెల్లడించింది. 'మా ఊరు అంబాజీపేట.. 10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలు, అయినా ఆగదు మా పాట' అనే క్యాప్షన్ తో షేర్ చేసింది.

ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూశారు. మార్చి 1న ఆహా ఓటీటీలోకి రాగానే ఎగబడి చూడటంతో ఐదు రోజుల్లోనే ఈ మూవీ రికార్డు 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ మైల్ స్టోన్ అందుకుంది. కథ, ఎమోషన్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story