Anupama Parameswaran : అనుపమ మహా ముదురు.. రిపోర్టర్ల ప్రశ్నలకు దీటైన బదులు
టిల్లు (DJ Tillu) స్టార్ సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తుంది. నిన్న ఓ మై లిల్లీ అనే పాటను రిలీజ్ చేశారు.. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ఆన్సర్స్కి రిపోర్టర్లకి మైండ్ బ్లాక్ అయిపోయింది.
టిల్లు స్క్వేర్ బోల్డ్ గా నటించడంపై అనుపమ పరమేశ్వరన్ ను రిపోర్టర్ ప్రశ్న అడగగా.. కొన్నేళ్లుగా చేస్తున్న క్యారెక్టర్స్నే మళ్లీ మళ్లీ చేస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. అదే నాకూ అనిపించిందని . అయితే ఈ మూవీలో లిల్లీ పాత్రను వదులుకుంటే అది నా చెత్త నిర్ణయం అవుతుంది. మరో మూవీలో ఇలాంటి పాత్ర దొరకదు. డైరెక్టర్ ఇచ్చిన పాత్రను నా పరిధి మేరకు నటించా. బిర్యానీ ఎంత ఇష్టమైనా ప్రతి రోజూ తినలేం కదా అంటూ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.
రిపోర్టర్ పదే పదే అదే ప్రశ్న వేయడంతో.. మీకు బిర్యానీ అంటే ఇష్టమా..కానీ ఇంట్లో ప్రతి రోజూ బిర్యానీ తింటారా? లేదు కదా అలానే నేను కూడా ప్రతి రోజూ బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు. నాకు కూడా డిఫరెంట్ పులావ్ కావాలి. పులిహోర కావాలి అన్నీ కావాలంటూ అనుపమ చెప్పుకొచ్చింది. అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో అనుపమ పరమేశ్వరన్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com