Kangana Ranaut : ఎన్నికల తర్వాత సినిమాల్లో కొనసాగుతా: కంగనా రనౌత్

Kangana Ranaut : ఎన్నికల తర్వాత సినిమాల్లో కొనసాగుతా: కంగనా రనౌత్

ఎన్నికల తర్వాత కూడా తాను సినిమాల్లో కొనసాగుతానని హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపారు. ‘నేను సినిమాలు మానేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇండస్ట్రీలో నేను చేయాల్సిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. త్వరలో ‘ఎమర్జెన్సీ’ విడుదల కానుంది. ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది’ అని ఆమె చెప్పారు. కాగా కంగనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగనా.. ‘ఎమర్జెన్సీ’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. 2019లో విడుదలైన ‘మణికర్ణిక’ తర్వాత ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా రానున్న ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన ఆస్తులన్నింటినీ తనఖా పెట్టి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించగా.. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జూన్‌ 14న ఈ చిత్రం విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story