Vishwambara Update : మెగాస్టార్ 'విశ్వంభర'లో మెయిన్ విలన్ రావు రమేశ్.. ట్విస్ట్ అదిరింది

Vishwambara Update : మెగాస్టార్ విశ్వంభరలో మెయిన్ విలన్ రావు రమేశ్..  ట్విస్ట్ అదిరింది

టాలీవుడ్ లో ఇపుడు క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే అందరూ చెప్పే మాట విశ్వంభర మూవీ. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చాన్నాళ్ల తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట ' విశ్వంభర'ను భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఈ మూవీ చేస్తున్నారు.

చిరంజీవి కెరీర్ లో ఇది 156వ సినిమా. త్రిష మెయిన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. యంగ్ హీరోయిన్స్ కూడా చిరంజీవి విశ్వంభర లో నటిస్తున్నారరు. ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు ఉంటారు అనే అంశంపై ఇప్పటివరకు ఎటువంటి వార్తలు రాలేదు. మెయిన్ విలన్ పాత్రకు ఓ వెర్సటైల్, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ ఉన్న నటుడైతే బాగుంటుందన్న డైరెక్టర్ ఒపీనియన్ తో చిరంజీవి కూడా ఓకే అన్నాడట.

ఓ అమ్రిష్ పురి లాగా, ఓ అఘోరాలాగా డిఫరెంట్ గా కనిపించే ఈ పాత్రకు రావు రమేశ్ ను సెలెక్ట్ చేశారని వినికిడి. వశిష్ట చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడట. చిరంజీవి, రావు రమేశ్ కాంబో చాన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు విశ్వంభరతో అది సాధ్యమవుతుంది. గతంలో రావు గోపాల రావుతో చిరంజీవి చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఎం.ఎం. కీరవాణి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విశ్వంభరను నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story