Moghali Rekulu : మొగలి రేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ కన్నుమూత
మొగలి రేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్ ఆయన భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్.
కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం.. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం.. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి’’ అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.
మొగలి రేకులు సీరియల్ బుల్లితెరపై సంచలనం సృష్టించింది. మంజుల నాయుడు తెరకెక్కించే సీరియల్స్ అప్పట్లో టీవీ అడియన్స్కు విపరీతమైన ఇష్టముండేది.మొగలి రేకులుతో పాటుగా చక్రవారం సీరియల్ లో కూడా పవిత్రనాథ్ నటించాడు. ఇక గతంలో పవిత్రనాథ్పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే ఇంటికి వారిని తీసుకువచ్చేవాడని.. దీని గురించి ప్రశ్నిస్తే.. తనను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com