Madhapur : మాదాపూర్ లో రకుల్ ప్రీత్ రెస్టారెంట్

Madhapur : మాదాపూర్ లో రకుల్ ప్రీత్ రెస్టారెంట్

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఎంటర్ ప్రెన్యూర్ గాను దూసుకుపోతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకుంటోందీ అమ్మడు. ఇంతకుముందు ఎఫ్ 45 పేరుతో జిమ్ ల వ్యాపారంలోకి దిగిన రకుల్ ప్రీత్ మెట్రో నగరాల్లో జిమ్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు తన మొదటి డైన్ రెస్టారెంట్ ను ప్రారంభించి ఆశ్చర్యపర్చనుంది. ఆరంభం మిల్లెట్ పేరుతో ఏప్రిల్ 16న నగరంలోని మాదాపూర్ లో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుంది.

దేశంలోని ప్రముఖ ఎఫ్ అండ్ బీ క్లౌడ్ కిచెన్ ఆపరేటర్ సహకారంతో ఈ రెస్టారెంట్ ప్రారంభించనుంది. ఆరంభం మిల్లెట్ తో మొదలవుతుంది అనేది ట్యాగ్ లైన్. ధాన్యం పోషక విలువల ఆధారంగా ప్రత్యేక మైన డైన్ కాన్సెప్ట్ మిల్లెట్ సెంట్రిక్ మెనూని ఈ రెస్టారెంట్ అందిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, స్వయంగా ఫిట్నెస్ ఔత్సాహికురాలు, ఆరోగ్య కరమైన ఆహార పద్ధతు లు, ప్రజల శ్రేయస్సును పెంపొందించడం కోసం రెస్టారెంట్ కు బ్రాండ్ అంబాసి డర్ కూడా వ్యవహరిస్తారు.

హైదరాబాద్ లో నా మొదటి రెస్టారెంట్ ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందరికీ రుచికరమైన, పోషకాహారాన్ని అందించా లనే లక్ష్యమిది. ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా ఆత్మకు కూడా అవసరమని నేను నమ్ముతున్నాను.ఆరంభంలో మేము దీన్ని అం దించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకేసారి అన్ని పో షకాలతో మిల్లెట్ గిన్నె అందిస్తాం' అంటోంది రకుల్. ఎఫ్ -45 జిమ్ ల తరహాలోనే రెస్టారెంట్ లను విస్తరించే ఆలోచన ఉందనీ అంటోంది.

Tags

Read MoreRead Less
Next Story