Kantara Prequel : కాంతార ప్రీక్వెల్‌లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్?

Kantara Prequel : కాంతార ప్రీక్వెల్‌లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్?

రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాంతార: చాప్టర్-1లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, లుక్ టెస్టులో ఆమె పాల్గొన్నారని తెలుస్తోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో నటనతో ఆమె మెప్పించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ షూటింగ్ వేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు, ఈ ప్రాజెక్టులో తాను భాగమైనట్లు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. రిషబ్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ‘కాంతార 2 లోడింగ్‌’ అని పేర్కొంది. మరి, వీరిద్దరూ హీరోయిన్లుగా నటిస్తారా? ఊర్వశి స్థానంలో రుక్మిణిని తీసుకుంటున్నారా? అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. కాంతారలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించి, అలరించింది

Tags

Read MoreRead Less
Next Story