Tamannah : ట్రోలింగ్స్ పట్టించుకోను.. తమన్నా కామెంట్స్ వైరల్

Tamannah : ట్రోలింగ్స్ పట్టించుకోను.. తమన్నా కామెంట్స్ వైరల్

సోషల్ మీడియా ఎక్కువగా వినియోగంలోకి వచ్చిన తరువాత సె లబ్రిటీలపై బాగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. దీని కారణంగా చాలా మంది ప్రముఖులు ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ క్రమంలో సెలబ్రిటీలపై జరుగుతున్న ట్రోలింగ్ పై హీరోయిన్ తమన్నా తాజాగా స్పందించింది. సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల విషయంలో నిజాలు తెలుసుకోకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతుంటారని ఆవేదన వెలుబుచ్చింది.

తమ జీవితంలో ఏం జరగనుందో కూడా వాళ్లే చెప్పేస్తుంటారని మండిపడింది. అలాంటి వాటిపై తాను ఏ మాత్రం దృష్టి పెట్టనని స్పష్టం చేసింది. వాటి గురించి ఆలోచిస్తే మనమే ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనే దానిపైనే తాను శ్రద్ధ పెడతానని పేర్కొంది. ప్రస్తుతం అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న తమన్నా.. తనకు ఆ రెండు ఇండస్ట్రీలు సమానమేనని చెప్పుకొచ్చిం ది.

ఆర్టిస్ట్ లకు భాషతో సంబంధం ఉండదని.. నిరంతరం ప్రయాణిస్తూనే తెలిపింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే తమ పని అని తమన్నా చెప్పింది. గతేడాది వరుస వెబ్ సిరీస్లు, సినిమాలతో మంచి వి జయాలను సొంతం చేసుకుంది తమన్నా. ప్ర స్తుతం బాలీవుడ్ లో రాజ్కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న స్త్రీ 2 కోసం ప్రత్యేక గీతంలో నటిస్తోంది ఈ బ్యూటీ.

Tags

Read MoreRead Less
Next Story