Trisha : ఆ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పిన త్రిష

Trisha : ఆ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పిన త్రిష

హీరోయిన్ త్రిషపై (Trisha) అన్నాడీఎంకే పార్టీ మాజీ నేత ఏవీ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలతో తీవ్ర అసహనానికి గురైన త్రిష.. ఏవీ రాజుపై న్యాయ పోరాటానికి దిగింది. కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ వివాదంలో ఇండస్ట్రీ మొత్తం త్రిషకు మద్దతుగా నిలవాల్సి ఉండగా.. చాలా మంది ఈ విషయం పట్టనట్లుగా వ్యవహరించారు. కనీసం ఏవీ రాజు వ్యాఖ్యలను ఖండించ లేదు. కొద్ది మంది మాత్రమే త్రిషకు అండగా నిలిచారు.

వారిలో నటులు నాజర్, సముద్రఖని, దర్శకుడు చేరన్ మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఏవీ రాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ వివాదం విషయంలో తనకు మద్దతుగా నిలిచిన ఆ ముగ్గురికి త్రిష కృతజ్ఞతలు తెలిపింది. ఆ ముగ్గురిని అన్నయ్యలుగా అభివర్ణిస్తూ థాంక్స్ చెప్పింది.

త్రిష ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. పలు సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉంది. రీసెంట్ గా విడుదలైన లియో సినిమాతో మంచి హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అజిత్ హీరోగా వస్తున్న విడాముయర్చి చిత్రం, కమలహాసన్ కు జంటగా థగ్స్ లైఫ్ వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story