Maharashtra : చిన్న నిర్లక్ష్యం.. 13 మంది బలి

Maharashtra : చిన్న నిర్లక్ష్యం.. 13 మంది బలి
మహారాష్ట్రలో జాతీయ రహదారి నెత్తురోడింది. ఓ చిన్న నిర్లక్ష్యం.. 13 మందిని బలి తీసుకుంది. బుల్థానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

మహారాష్ట్రలో జాతీయ రహదారి నెత్తురోడింది. ఓ చిన్న నిర్లక్ష్యం.. 13 మందిని బలి తీసుకుంది. బుల్థానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వేపై టిప్పర్‌ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కాసేపట్లో తమ గమ్యానికి చేరుకుంటామనగా జరిగిన ఈ ప్రమాదంలో టిప్పర్‌పై ఉన్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వీరంతా రోజువారీ కూలీలుగా భావిస్తున్నారు. ఘటనాస్థలం బంధువుల రోదనలతో హృదయవిదారకంగా మారింది. పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story