Incident : వేములవాడలో దారుణం..లాడ్జీలో బాలికపై యువకుడి అత్యాచారం

Incident : వేములవాడలో దారుణం..లాడ్జీలో బాలికపై యువకుడి అత్యాచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ లాడ్జిలో బాలికపై యువకుడు అత్యాచారం చేయగా ఆమె పరిస్థితి విషమించింది. దీంతో కరీంనగర్​ దవాఖానకు తరలించారు. నిందితుడిపై కిడ్నాప్, రేప్, పోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్​ల కింద కేసు నమోదు చేసినట్టు టౌన్​ సీఐ కరుణాకర్​ తెలిపారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మైదం సాయికుమార్ (Sai Kumar)​ (23) జగిత్యాల జిల్లాలో ఓ బాలికను కిడ్నాప్​ చేసి వేములవాడలోని ప్రైవేట్​లాడ్జికి తీసుకువచ్చాడు. అక్కడ అత్యాచారం చేయగా బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో ముందు వేములవాడలోని ఓ దవాఖానకు తీసుకువెళ్లగా డాక్టర్ల సూచన మేరకు కరీంనగర్​ తరలించారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు సాయికుమార్​పై కేసు నమోదు చేశారు. రూల్స్​ పాటించని లాడ్జి నిర్వాహకుడిపైనా కేసు ఫైల్​ చేశామని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story