Accidents : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

Accidents : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

తెలంగాణలో ఏప్రిల్ 11, 12 మధ్య రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. హన్మకొండ జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో మొదటి ప్రమాదంలో ఓ మహిళ, ఆమె మూడు నెలల కూతురు మృతి చెందారు.

ఆత్మకూర్ మండలం గుడ్డెపాడు గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు.

సూర్యాపేట జిల్లాలో ఇదే తరహా ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక వైపు నుంచి నిలబడి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. మృతులను మహ్మద్ నవీద్ (25), నిఖిల్ రెడ్డి (26), రాకేష్ (25)గా గుర్తించారు. క్షతగాత్రుడిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story