Murder : రూ.పదివేల కోసం భార్యను చంపిన భర్త

Murder : రూ.పదివేల కోసం భార్యను చంపిన భర్త

యూపీలో మరో అరాచకం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. గోవింద్ అనే నిందితుడు ఇంట్లో గొడవలతో భార్య మంజును హత్య చేశాడు. మంజు ఒక నర్సు, ముగ్గురు పిల్లల తల్లి. ఫోటోగ్రాఫర్ అయిన గోవింద్‌తో వివాహమై సుమారు 14 సంవత్సరాలు అయ్యింది. వారి మధ్య మొదటి నుండి కలహాలు ఉన్నాయి. దీంతో.. ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.

గోవింద్, అతని కుటుంబ సభ్యులు తన సోదరిని నిత్యం వేధిస్తున్నారని మంజు సోదరుడు జనక్ సింగ్ ఆరోపించాడు. భార్య నుంచి భర్త రూ. 10వేలు తీసుకున్నాడని.. దీనిపైనే గొడవ పెద్దదైందని చెప్పాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఆవేశంతో తన భార్యను కత్తితో పొడిచి చంపాడని గోవింద్‌ విచారణలో అధికారుల ముందు అంగీకరించాడు. గోవింద్ తన భార్య మృతదేహంతో చాలా గంటలపాటు ఉండి చివరకు పోలీసులకు లొంగిపోయాడు.

ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు.. గోవింద్ ను జైల్లో పెట్టారు. గోవింద్ ను వారించని ఆయన కుటుంబసభ్యుల కోసం గాలింపు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story