Macherla: టీడీపీ నేత దారుణ హత్య.. బండరాయితో తలపై మోది..

Macherla: టీడీపీ నేత దారుణ హత్య.. బండరాయితో తలపై మోది..
Macherla: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో దారుణం జరిగింది.

Macherla: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో దారుణం జరిగింది. టీడీపీ నేత తోట చంద్రయ్యను నడిరోడ్డుపై చంపేసింది. తలపై బండరాయితో మోది కిరాతకంగా చంపేశారు. చంద్రయ్య రాజకీయంగా ఎదుగుతుడటం ఓర్వలేకే ప్రత్యర్థివర్గం అతన్ని చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. చంద్రయ్యను హత్య చేసినవాళ్లలో వెల్దుర్తి MPP చింతా శివరామయ్య, ఆయన కుమారుడు ఆదినారాయణ, గుండ్లపాడు మాజీ సర్పంచ్ తోట రామాంజనేయులు ఉన్నారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో గుండ్లపాడుకు వెళ్లబోతున్నారు. చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే చంద్రయ్య దారుణ హత్యతో గుండ్లపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబును గుండ్లపాడు వెళ్లేందుకు అనుమతిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story